దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు... కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు... కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లేటెస్టుగా కేంద్రం సంచలన విషయాన్ని ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందనిఅది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని చెప్పింది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వంముందస్తుగానే కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పడదని లేఖలో హెచ్చరించారు రాజేశ్ భూషణ్. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తోందనిఅయితే, దీనికి తగ్గట్టుగా గట్టి చర్యలను తీసుకోవడం లేదని చెప్పారు. అంతేకాదు కరోనా నిబంధనల గతంలో మాదిరిగానే అమలు చేయాలని అన్నారు.