రాష్ట్రంలో కరోనా సెకండ్‌‌ వేవ్‌‌

రాష్ట్రంలో కరోనా సెకండ్‌‌ వేవ్‌‌
  • జాగ్రత్తగా ఉండకపోతే కేసులు భారీగా పెరుగుతయ్
  •  పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు హెచ్చరిక
  • మాస్క్, వ్యాక్సినే సెకండ్ వేవ్‌‌ నుంచి కాపాడుతయ్
  •  మాస్‌‌ గ్యాదరింగ్‌‌కు దూరంగా ఉండాలి
  • రూమర్లు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్‌‌
  • లాక్​డౌన్​, కర్ఫ్యూలతో ఉపయోగం లేదు
  • 45 ఏండ్లు దాటినోళ్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్​ వేసుకోవాలి
  • జనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని, జాగ్రత్తగా ఉండకపోతే కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ వేవ్‌‌ పీక్‌‌ స్టేజ్‌‌కు వెళ్లొద్దంటే, అందరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలను ఫాలో కావాల్సిన టైమ్ మళ్లీ వచ్చిందన్నారు. పిల్లలు, వృద్ధులు, పేషెంట్లు, గర్భిణులంతా హోలీ, ఉగాది, రంజాన్‌‌, ఈస్టర్‌‌‌‌ పండుగలకు దూరంగా ఉండాలన్నారు. వైరస్ అంటించుకుని ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెట్టొద్దని యూత్‌‌కు సూచించారు. ఫంక్షన్లకు దూరంగా ఉండాలని, అటెండైనా మాస్క్‌‌ కంపల్సరీగా పెట్టుకోవాలన్నారు. నాలుగైదు నెలలుగా జనాలు కరోనా గైడ్​లైన్స్​ పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ఎపిడమాలజిస్టులు అంచనా వేస్తున్నారని ఆయన వెల్లడించారు. (మొదటి పేజీ తరువాయి) సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకు తమ వైపు నుంచి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, జనాలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి శ్రీనివాసరావు శనివారం మీడియాతో మాట్లాడారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, కంట్రోల్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నామన్నారు.

మహారాష్ట్ర, కర్నాటక సహా ఇతర రాష్ట్రాల బార్డర్ జిల్లాల్లో, అర్బన్ ఏరియాలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచినట్లు చెప్పారు. కేసులు ఎన్నొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల సహకారంతోనే ఇన్నాళ్లూ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేయగలిగామని చెప్పారు. నాలుగైదు నెలలుగా కేసులు, మరణాలు పూర్తిగా తగ్గిపోవడంతో జనం జాగ్రత్తలు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పుడు మరోసారి పాత పరిస్థితులు వచ్చాయని, అప్పటిలాగే మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. రూమర్లపై లీగల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్, కర్ఫ్యూలతో ఉపయోగం ఉండదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా గురించి ఏడాది కాలంగా అనేక పాఠాలు నేర్చుకున్నామని, ఆ అనుభవాన్నంతా ఉపయోగించి వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్ చేస్తామని చెప్పారు. స్కూళ్లు, కాలేజీల బంద్ కూడా తాత్కాలికమేనన్నారు. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్ఫ్యూ ఉండదని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్, కర్ఫ్యూ అంటూ సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోవొద్దు కరోనా వచ్చిందని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు పోయి లక్షల రూపాయలు లాస్ కావొద్దని డీఎంఈ రమేశ్​రెడ్డి సూచించారు. ఇప్పుడు వచ్చే కేసులన్నీ మైల్డ్ సింప్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఉంటున్నాయని, ఇంట్లో ఉండి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. కోమార్బిడ్ పేషెంట్లు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఊపిరి తీసుకోవడంలో కొంచెం కష్టం అనిపించినా, దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానలో అడ్మిట్ కావాలన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, 10 వేల ఆక్సిజన్ బెడ్లు, వెయ్యికిపైగా వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అన్ని రకాల మందులు, వేల మంది కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇచ్చిన అనుభవం ఉన్న డాక్టర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఎంత మంది పేషెంట్లు వచ్చినా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తామన్నారు. ప్రస్తుతం సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులను గాంధీ హాస్పిటల్​లో, మోడరేట్ కేసులను టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ చేసుకుంటున్నామని చెప్పారు. అన్ని జిల్లా హాస్పిటళ్లలో కరోనా వార్డులు ఏర్పాటు చేశామని, గత ఏడాది తీరుగా హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం లేదన్నారు. కరోనా మైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చినా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉందని రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే అలాంటి కేసులు వస్తున్నాయని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వైరస్ సోకకుండా మాస్క్ పెట్టుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

వ్యాక్సిన్ తీసుకోండి

కరోనా నుంచి మాస్క్, వ్యాక్సిన్ మాత్రమే మనల్ని రక్షించగలవని శ్రీనివాసరావు అన్నారు. దురదృష్టవశాత్తు మన దగ్గర వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడానికి జనాలు ఇప్పుటికీ సంకోచిస్తున్నారని చెప్పారు. వ్యాక్సిన్లతో ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏప్రిల్​ 1 నుంచి వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఏ వ్యాక్సిన్​కు అయినా వంద శాతం ఎఫికసీ ఉండదని, అందువల్లే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంత మందికి వైరస్ సోకుతోందని చెప్పారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు వైరస్ సోకినా వాళ్లపై పెద్దగా ప్రభావం చూపలేదని వెల్లడించారు. ఒంట్లో ఉన్న వ్యాక్సిన్ వైరస్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొంటుందని చెప్పారు.