ఏపీలో 19 లక్షలకు చేరువైన కరోనా టెస్టులు

ఏపీలో 19 లక్షలకు చేరువైన కరోనా టెస్టులు

అమరావతి, వెలుగు: ఏపీలో గడిచిన 24 గంటల్లో 70,068 టెస్టులు చేయగా 10,167 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కు చేరింది. కరోనాతో  గురువారంఒక్కరోజే 68 మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరు 9, అనంతపురం 8,కర్నూలు 8, విశాఖపట్నం8, చిత్తూరు 6, కడప 6,ప్రకాశం 4, విజయనగరం 4, కృష్ణా 3, నెల్లూరు,శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.మొత్తం మృతుల సంఖ్య 1,281కి పెరిగింది.కరోనా నుంచి కోలుకుని గడిచిన 24 గంటల్లో
అత్యధికంగా 4,618 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్అయినట్లు ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ బులెటిన్ లో పేర్కొం ది. ఇప్పటి వరకు మొత్తం 60,024 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.ప్రస్తుతం 69,252 యాక్టివ్  కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 18,90, 077 మందికి టెస్టులు చేసినట్లు తెలిపింది.