
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ప్రాణాంతక వైరస్ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. సోమవారం నాటికి చైనాలో దీని బారిన పడిన వారి సంఖ్య 17,200కి చేరింది. వీరిలో 361 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లోనూ ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది. ఒకరి నుంచి మరోకరికి వ్యాపిస్తున్న ఈ వైరస్కు ఇంత వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కరోనా వైరస్ను నివారించే మందు కనుగొనేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వాటికి ప్రపంచం ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సహకారం అందిస్తోంది.
వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. కరోనా సోకిన ఓ బాధితుడి బ్లడ్ శాంపిల్ను సేకరించి పరిశోధనలు చేస్తున్నారు. పీటర్ డొహెర్టీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇమ్యూనిటీ శాస్త్రవేత్తలు.. ఆ శాంపిల్ నుంచి సేకరించిన రక్త కణాల ద్వారా ల్యాబ్లో కరోనా వైరస్ను డెవలప్ చేశారు. వారు కరోనా వైరస్ కదలికల తీరును మైక్రోస్కోప్లో పరిశీలిస్తున్న వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఈ వైరస్ సైజు 20 నానో మీటర్లు ఉందని తెలిపారు. అలాగే ఈ వైరస్ను ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులకు తమ వద్ద ఉన్న డేటాను షేర్ చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఈ వైరస్ను మైక్రోస్కోప్లో చూసినప్పుడు దానికి కిరీటంలా దాని చుట్టూ పెరుగుతున్న దాన్ని బట్టి దీనికి కరోనా అని పేరు పెట్టారు. లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం.
వైరస్లను కంటితో చూడలేనంత సూక్ష్మంగా ఉంటాయి. ఈ కరోనా వైరస్ 20 నానో మీటర్స్ సైజులో ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ 20 నానో మీటర్లు అంటే ఎంతో చూద్దాం. ఒక మీటరు పొడవున్న వస్తువును 2 వేల కోట్ల భాగాలు చేస్తే ఎంత చిన్నగా అవుతుందో ఆదే సైజులో కరోనా వైరస్ ఉంటుంది.