
ఆడపిల్లలు లేరని వాటిని పెంచుకుంటున్రు
కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: ఆడపిల్లలు లేరనే బెంగను మొక్కలు పెంచి తీర్చుకుంటున్నారా కార్పొరేట్ దంపతులు. కరీంనగర్ కార్పొరేషన్ 19వ డివిజన్(రేకుర్తి) కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, హేమలత దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. ప్రకృతి ఆడపిల్లలతో సమానమని భావించిన వారు గత ఏడాది సెప్టెంబర్ 15న ఇంటి వద్ద రెండు మొక్కలు నాటి పల్లవి, హరితగా పేర్లు పెట్టారు. మంగళవారం ఆ మొక్కల బర్త్డే నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డివిజన్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
For More News..