
రాష్ర్టంలో ఎక్కడా లేని అవినీతి సూర్యాపేట జిల్లాలోనే జరుగుతోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరావు. అదికూడా మంత్రి జగదీష్ రెడ్డి కనుసైగల్లో పెద్ద అవినీతి జరుగుతోందని. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారన్నారు. ప్రశ్నించినందుకు బీజేపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.
అక్రమాకు పాల్పడిన అధికారులకు అండగా నిలిచిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సంకినేని. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని.. సూర్యాపేటలోని కొనుగోలు కేంద్రాల్లో వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని.. వీటిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలో దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంకినేని కోరారు.
ఇవి కూడా చదవండి
ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా