గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

గ్రూప్1 పరీక్షలు మొత్తం రద్దు చేయాలని ఎన్ఎస్ యూఐ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన  పిటిషన్ హై కోర్టు ఆగస్టు 3న విచారణ చేపట్టింది. పిటిషన్ పై బోర్డు, వెంకట్ తరఫు లాయర్ల వాదనలు విన్న హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. 

ఈ క్రమంలో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. గ్రూప్1 ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా మొత్తం పరీక్షల్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని వెంకట్ డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను అభ్యర్థులు రాశారు. ఈ క్రమంలో కోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో అభ్యర్థులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.