భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభమయ్యాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా.. అన్ని పరీక్షల తర్వాత ముగ్గురికి వ్యాక్సిన్ వేశారు. రెండు నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల్లో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గ్రీన్ సిగ్నల్ తెలిపింది.
సుమారు వంద మందిపై ట్రయల్స్ నిర్వహించాల్సి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 108 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, స్క్రీనింగ్ తర్వాత వ్యాక్సిన్ వేస్తామన్నారు. ట్రయల్స్లో ఇంట్రామాస్కులర్ విధానంలో 0.5 ML మోతాదు ఇచ్చామని.. ఆ తర్వాత వారిని రెండు గంటలు పరిశీలినలో ఉంచినట్లు చెప్పారు. తొలి డోసు ఇచ్చిన తర్వాత పిల్లల్లో ఎలాంటి చెడు ఫలితాలు కనిపించలేదని చెప్పారు.