ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గింది. రోజు వారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,066 మందికి టెస్టులు చేయగా.. 896 మందికి పాజిటివ్ వచ్చిందని ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఒక్క రోజులో ఆరుగురు మరణించారని, 8,849 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,12,029కి చేరగా.. మృతుల సంఖ్య 14,694కు పెరిగింది. కరోనా నుంచి రివకరీ అయిన వారి సంఖ్య 22,72,881 మందికి చేరింది. ప్రస్తుతం ఏపీలో 24,254 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 12/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 12, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,12,029 పాజిటివ్ కేసు లకు గాను
*22,72,881 మంది డిశ్చార్జ్ కాగా
*14,694 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 24,454#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/RjdP0sEe54