ముంబైలో కొత్తగా 852 కొవిడ్ కేసులు

ముంబైలో కొత్తగా 852 కొవిడ్ కేసులు

ముంబైలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది. 24 గంటల్లో కేసుల సంఖ్య 79శాతం పెరిగింది. బుధవారం ముంబైలో 852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకరు చనిపోయారు. జులై 1 తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ముంబైలో 19,661 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

జులై 1న ముంబైలో 978 కేసులు నమోదుకాగా.. ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే బుధవారం మాత్రం వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 852 కేసుల్లో 36 మంది పేషెంట్లలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.