యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు

యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు

‘స్వచ్ఛ హైదరాబాద్- గాంజా రహిత హైదరాబాద్’

దేశానికి యువత ఎంతో అవసరమని.. అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు అని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్- గాంజా రహిత హైదరాబాద్’ లో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదక ద్రవ్యాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ‘ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి. ఎవరైనా మత్తు పదార్థాలకు బాసిస అయినట్లు గ్రహిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర సీపీ అంజనీ కుమార్, అంబర్‎పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఓయూ వీసీ రవీందర్, డీసీపీ రమేష్, నగర పోలీసులు, ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు.