గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్టూడెంట్ల కోసం ‘సేఫ్టీ క్లబ్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబారాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ(సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్) ఆధ్వర్యంలో ‘సేఫ్టీ ఫస్ట్.. సేఫ్టీ ఆల్వేస్’ ట్యాగ్ లైన్తో ఏర్పాటుకానున్న ఈ సేఫ్టీ క్లబ్స్కు సంబంధించిన లోగో, బ్రోచర్ను బుధవారం గచ్చిబౌలిలోని టీసీఎస్ పార్కు ఆడిటోరియంలో సీపీ రవీంద్ర లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేఫ్టీ క్లబ్స్లో ఉండే బాలమిత్రలు స్టూడెంట్ల మాటలను శ్రద్ధగా విని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. ఏదైనా సంఘటన గురించి పిల్లలు చెబితే ఆ విషయం గురించి మాట్లాడేలా వారికి స్వేచ్ఛనివ్వాలని పేర్కొన్నారు.
మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. ఈ సేఫ్టీ క్లబ్స్కు ఫిజికల్సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, యాంటీ డ్రగ్అబ్యూజ్ అండ్ మెంటల్ హెల్త్ నాలుగు పిల్లర్లుగా ఉంటాయని, ప్రతి స్కూల్లోని బాలమిత్ర టీచర్ వీటి గురించి నెలకోసారి స్టూడెంట్లకు వివరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ , టీసీఎస్ జీఎం రాజు, సంగమిత్ర స్కూల్ ఫౌండర్ అనురాధ, స్కూల్ ప్రిన్సిపల్స్, టీచర్లు పాల్గొన్నారు.