- పీఎస్లో దంపతులతో కాళ్లు మొక్కించారని సమాచారం
- విచారణకు ఆదేశం త్వరలోనే యాక్షన్
ఉప్పల్, వెలుగు : పిల్లలు ఇంటి ముందు క్రికెట్ఆడారనే కోపంతో స్థానిక కాంగ్రెస్పార్టీ లీడర్ఒకరు బూతులు తిడుతూ బిహార్కు చెందిన దంపతులపై దాడికి పాల్పడగా, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం వారి మెడకు చుట్టుకునేలా ఉంది. కొద్ది రోజుల కింద ఉప్పల్లక్ష్మీనారాయణ కాలనీలో ఓ కాంగ్రెస్నేత ఇంటి ఎదుట రాత్రి వేళలో పిల్లలు క్రికెట్ఆడుతున్నారని తిట్ల దండకం అందుకున్నాడు. అడ్డువచ్చిన తల్లిదండ్రులను కూడా వదల్లేదు.
బిహార్కు చెందిన దంపతులను బూతులు తిడుతూ దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్నంతా వీడియో తీస్తున్నాం అని చెప్పినా లెక్క చేయలేదు. పైగా కొట్టి ఫోన్ను విసిరేశాడు. దాడిలో ఒకరికి గాయాలు కాగా, వారు ఫిర్యాదు చేయడానికి ఉప్పల్పీఎస్కు వెళ్లారు . కానీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకుండా, జీడీ ఎంట్రీ పెట్టి కాంగ్రెస్ నేతకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అతడు వచ్చి తనపైనే దాడి చేశారని, తన ఉంగరం కూడా పోయిందని ప్రతి ఫిర్యాదు ఇచ్చాడు.
కేసు రివర్స్ తిప్పడం, పోలీసులు కాంగ్రెస్నేతకు సహకరిస్తుండడంతో బాధితులు మిన్నకుండిపోయారు. అక్కడే సదరు కాంగ్రెస్నేత కాళ్లు మొక్కి కేసు వాపస్తీసుకుని ఇంటికి వచ్చారు. ఇందులో ఉప్పల్పోలీసుల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం బీజేపీ, బీఆర్ ఎస్నేతలకు తెలియడంతో వారు సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే, ఈ ఘటనలో పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో సీపీ సుమతి సీరియస్అయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. త్వరలోనే సంబంధిత పోలీసులపై యాక్షన్తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
