
కేసీఆర్ కోవిడ్ నియంత్రణ పక్కన పెట్టి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కరోనా పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేరళలో 19 రకాల ఆహార వసతులు, రూ. 5 వేల సహాయం అందిస్తుందన్నారు. కేరళలో చేస్తున్న సహాయక చర్యల్లో తెలంగాణలో నాలుగో వంతు కూడా చేయడం లేదన్నారు. ప్రతీ కుటుంబానికి రూ.10 వేల రూపాయలతో పాటు అన్ని హాస్పిటల్లో వసతులు కల్పించాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు వ్యతిరేకంగా ఆగస్టు 15 న నిరసన తెలియజేస్తామన్నారు. దేశాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి అని ఆగస్టు 15 న ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 5న ప్రధాని మోడీ మాట్లాడిన తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. అయోధ్యలో భూమి పూజలో పాల్గొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. కోవిడ్ ను అడ్డం పెట్టుకుని పబ్లిక్ సెక్టార్స్ ను అమ్మేస్తున్నారన్నారు నారాయణ.