నవంబర్ 25న తెలంగాణకు సీతారాం ఏచూరి

నవంబర్ 25న తెలంగాణకు సీతారాం ఏచూరి

సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం

హైదరాబాద్, వెలుగు: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ బృందా కారత్ శనివారం రాష్ట్రానికి రానున్నారు. సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఏచూరి 25న సాయంత్రం పాలేరులో, 26న మధ్యాహ్నం భువనగిరిలో, 27న మిర్యాలగూడలో జరిగే ప్రచారంలో పాల్గొంటారని పార్టీ కమిటీ సభ్యుడు బాబురావు వెల్లడించారు. 

బృందా కారత్ 25న వైరా, మధిరలో, 26న ఇబ్రహీంపట్నంలో, 27న భద్రాచలంలోని దుమ్ముగూడెం, చర్లలో, 28న కోదాడ, హుజూర్ నగర్​లో నిర్వహించే  ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఖమ్మం, మధిర సభల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం భద్రాచలం సెగ్మెంట్ లోని వాజేడులో, సాయంత్రం భద్రాచలంలో ప్రచారం చేస్తారు. 26న పాలేరు సెగ్మెంట్లోని కూసుమంచిలో ప్రచారంలో పాల్గొంటారు.