ఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ

ఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ


హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్​ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  జరిగే ఈ సమావేశాలకు రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు అంటెండ్ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో  రాష్ట్ర సీపీఎం పోటీ చేయనుందా లేదా అనే దానిపై క్లారిటీ రానున్నది. ఈ మీటింగులకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు హాజరవుతారు.

 ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. మహబూబాబాద్, ఖమ్మం, నల్లొండ, మెదక్ తదితర సెగ్మెంట్లలోని రెండింటిలో పోటీ చేయాలని ప్రతిపాదించారు. జనవరి 17,18 తేదీల్లోనే  జరగాల్సిన ఈ సమావేశాలు..పార్టీ స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం అనారోగ్యం కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది.