- దీనిపై ఫిబ్రవరి15 వరకు నిరసనలు: జాన్వెస్లీ
హైదరాబాద్, వెలుగు : ఉపాధి స్కీమ్నిర్వీర్యానికి కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. సీపీఎంతోపాటు వామపక్ష పార్టీల సుదీర్ఘ పోరాటాలతో మహాత్మా గాంధీ పేరిట వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిస్థానంలో వీబీ- జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టాన్ని తెస్తూ నిధుల కోత, పనిదినాల కోతకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కూలీల పొట్టగొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఉపాధి స్కీమ్ను కాపాడుకోవడానికి శనివారం నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
