చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు

చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ అధికారులు మళ్లీ నోటీసుల అంటించారు. అమరావతిలో కృష్ణా నది కరకట్టకు ఆనుకుని ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ లో ఆయన ఆద్దెకు ఉంటున్నారు.

ఇది అక్రమ నిర్మాణమని దాన్ని తొలగించాలని రెండు నెలల క్రితం సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. దానికి స్పందించి ఇంటి యజమాని లింగమనేని రమేశ్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదంటూ ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చారు. వారంలోగా ఆ ఇంటిని కూల్చేయాలని, లేకుంటే ప్రభుత్వమే ఆ పని చేస్తుందని అందులో చెప్పారు.