ములుగు/తాడ్వాయి, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పుట్టిన రోజు వేడుకలు ములుగు జిల్లాలో గురువారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్శ్రేణులతోపాటు గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు క్యాంపు ఆఫీస్లో మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క కేక్ కట్ చేశారు. అనంతరం సర్పంచ్, కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో గెజిటెడ్ఆఫీసర్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్సంపత్ రావు సీతక్కను సత్కరించారు. ములుగు మున్సిపల్ కమిషనర్ జె.సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో బండారుపల్లి రోడ్డులోని డివైడర్లో మొక్కలు నాటారు.
తాడ్వాయిలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మాజీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, లైబ్రరీ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్చైర్పర్సన్ ఆసియా మిర్జా, కౌన్సిలర్లు, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్పర్సన్ ఇర్ప సుకన్య, సర్పంచ్ పీరీల భారతి పాల్గొన్నారు.
