- హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ
నారాయణ్ ఖేడ్, వెలుగు: మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ మండల పరిధిలోని బానాపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను వారు ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రోడ్ల నెట్ వర్క్ పెంచి ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.
