క్రికెట్ బాల్​ కోసం వెళ్లి గోడ సందులో ఇరుక్కున్నరు

క్రికెట్ బాల్​ కోసం వెళ్లి గోడ సందులో ఇరుక్కున్నరు
  • ఇద్దరు చిన్నారులను రెస్క్యూ చేసిన ఫైర్​ సిబ్బంది
  • చంపాపేటలో ఘటన

ఎల్​బీనగర్, వెలుగు: క్రికెట్ బాల్ కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు గోడ సందులో ఇరుక్కున్న ఘటన సరూర్​ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. చంపాపేటలోని రెడ్డిబస్తీకి చెందిన రాజ్ కుమార్(12), మధు(12) ఇద్దరూ స్నేహితులు. బుధవారం సాయంత్రం వీరిద్దరూ ఫ్రెండ్స్​తో కలిసి బస్తీలో క్రికెట్ ఆడుతున్నారు. రెండు ఇండ్ల గోడల మధ్యలో బాల్​పడటంతో రాజ్​కుమార్, మధు అక్కడికి వెళ్లారు. రెండు ఇండ్లలో ఒకటి పాతది కాగా.. వీరిద్దరు బాల్ కోసం ఆ ఇంటి గోడపైకి ఎక్కారు. ఈ క్రమంలో రెయిలింగ్​కూలి ఇద్దరూ కింద పడి రెండు గోడల మధ్య ఇరుక్కున్నారు.

సమాచారం అందుకున్న సరూర్​నగర్ పోలీసులు, మలక్​పేట ఫైర్ సిబ్బంది, బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో పాత ఇంటి గోడను పక్క నుంచి కూల్చివేసి చిన్నారులను రెస్క్యూ చేశారు. దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. వీరిలో రాజ్ కుమార్  పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.