- ఇద్దరు చిన్నారులను రెస్క్యూ చేసిన ఫైర్ సిబ్బంది
- చంపాపేటలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: క్రికెట్ బాల్ కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు గోడ సందులో ఇరుక్కున్న ఘటన సరూర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. చంపాపేటలోని రెడ్డిబస్తీకి చెందిన రాజ్ కుమార్(12), మధు(12) ఇద్దరూ స్నేహితులు. బుధవారం సాయంత్రం వీరిద్దరూ ఫ్రెండ్స్తో కలిసి బస్తీలో క్రికెట్ ఆడుతున్నారు. రెండు ఇండ్ల గోడల మధ్యలో బాల్పడటంతో రాజ్కుమార్, మధు అక్కడికి వెళ్లారు. రెండు ఇండ్లలో ఒకటి పాతది కాగా.. వీరిద్దరు బాల్ కోసం ఆ ఇంటి గోడపైకి ఎక్కారు. ఈ క్రమంలో రెయిలింగ్కూలి ఇద్దరూ కింద పడి రెండు గోడల మధ్య ఇరుక్కున్నారు.
సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు, మలక్పేట ఫైర్ సిబ్బంది, బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో పాత ఇంటి గోడను పక్క నుంచి కూల్చివేసి చిన్నారులను రెస్క్యూ చేశారు. దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. వీరిలో రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.