- ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడంపై సన్నీ
ముంబై: చెపాక్ స్టేడియంలో ఆదివారం రాత్రి కేకేఆర్తో సీఎస్కే మ్యాచ్ అనంతరం తన షర్ట్పై ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం తనకు ఎమోషనల్ మూమెంట్ అని లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ చెప్పాడు. ‘మ్యాచ్ తర్వాత సీఎస్కే టీమ్, ధోనీ స్టేడియంలో కలియతిరుగుతూ ఫ్యాన్స్కు అభివాదం చేస్తున్నారని తెలియగానే ఏదైనా గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నా.
చెపాక్లో ధోనీకి చివరి మ్యాచ్ కావడంతో ఆటోగ్రాఫ్ తీసుకుందామని అతని వద్దకు పరుగెత్తా. నేను వేసుకున్న షర్ట్ పై ఆటోగ్రాఫ్ చేయాలని మహీని అడిగా. తను వెంటనే అంగీకరించడం నాకు ఆనందం కలిగించింది. పక్కనే ఉన్న కెమెరామెన్ మార్కర్ పెన్ ఇచ్చాడు. అతనికి కూడా థ్యాంక్స్. ఇది నాకు ఎమోషన్ మూమెంట్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్కు ధోనీ ఎంతో సేవ చేశాడు’ అని సన్నీ చెప్పుకొచ్చాడు.