ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు

ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు

జూబ్లీహిల్స్​, వెలుగు : ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ పరిధి ఎన్ఆర్ఆర్​పురం కాలనీలో వెంకటేశ్వర క్లినిక్​, ఏయా హెల్త్​ కేర్​పేరుతో  డాక్టర్లుగా రాజమౌళి, ఉదయ్ ​కుమార్​ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.  వీరికి ఎంబీబీఎస్​ సర్టిఫికెట్లు లేవు. మెడికల్ ​కౌన్సిల్, విజిలెన్స్​ అధికారులు గురువారం రాత్రి క్లినిక్ లపై దాడి చేయగా అసలు విషయం తెలిసింది. దీంతో ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులకు కంప్లయింట్ చేయగా క్రిమినల్ ​కేసులు నమోదు చేశారు.