మూడు రోజులకే విమర్శలా?.. బీఆర్‌‌‌‌‌‌ఎస్ నేతలపై విజయశాంతి ఫైర్

మూడు రోజులకే విమర్శలా?.. బీఆర్‌‌‌‌‌‌ఎస్ నేతలపై విజయశాంతి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌‌‌‌ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టా లని కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ నేత విజయ శాంతి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా గడవకముందే బీఆర్‌‌‌‌ఎస్ విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉంద న్నారు.

మంత్రి గా అనుభవం ఉన్న హరీశ్‌‌ రావు లాంటి వ్యక్తు లతో విమర్శలు ఎందుకు చేయిస్తున్నారో హాస్పిటల్‌‌లో ఉన్న కేసీఆర్‌‌కే తెల్వాలని విజయశాంతి సోమవారం ట్వీట్ చేశారు. పదేండ్లు పాలించి రాష్ట్ర ప్రజలపై రూ.5లక్షల కోట్ల అప్పుల భారాన్ని నెట్టిన బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ బాధ్యులపై కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు.