కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం రాత్రి నుంచి కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు ఆదివారం వేకువజామున కొనేరులో స్నానం చేసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.

కరీంనగర్ కు చెందిన మల్లన్న భక్తుడు పెద్ది అమర్నాథ్- సుచిత్ర దంపతులు స్వామివారికి రెండు తులాల బంగారంతో బంగారు కోరమీసం చేయించి సమర్పించారు. ఈఓ  బాలాజీ, ఏఈవోలు అంజయ్య, శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, అర్చకుడు మల్లికార్జున్, ఆలయ సిబ్బంది విజయ్ కుమార్, నర్సింహులు, అంజయ్య, మాధవి, సందీప్, మధుకర్, నవీన్ భక్తులకు సేవలందించారు.