సన్ రైజర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై గ్రాండ్ విక్టరీ సాధించింది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 వికెట్లు కోల్పోయి చెన్నై 18.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 35 తో రాణించగా.. మరో ఓపెనర్ డేవన్ కాన్వే 57 బంతుల్లో 77 పరుగులతో చెలరేగి జట్టును గెలిపించాడు. అజింక్యా రహానే 9, అంబటి రాయుడు 9 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మర్కెండేకు రెండు వికెట్లు పడ్డాయి.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ హర్రీ బ్రూక్ 18, అభిషేక్ శర్మ 34 పరుగులకే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి 21 మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించ లేదు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జడేజా 3, ఆకాష్ సింగ్, మహీష్ తీక్షాన, మతీషా పత్రినా తలో ఒక వికెట్ తీశారు.