
హైదరాబాద్, వెలుగు: మలబార్ గ్రూప్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్సార్) కార్యక్రమాల కోసం 2025–-26 సంవత్సరానికి గాను రూ.150 కోట్లు కేటాయించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆకలి తీర్చడం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి వాటి కోసం ఈ డబ్బును ఖర్చు పెడుతుంది.
తమ ప్రధాన సామాజిక సేవ కార్యక్రమం 'ది హంగర్ ఫ్రీ వరల్డ్' కింద భారతదేశం, జాంబియా దేశాల్లోని నిరుపేదలకు నిత్యం 70 వేల భోజనాలు అందిస్తుంది. 2025–-26 సంవత్సరంలో మొత్తం 2.50 కోట్ల భోజనాలను అందిస్తామని మలబార్ తెలిపింది.