సమాజ సేవకు రూ.150 కోట్లు... ప్రకటించిన మలబార్ గోల్డ్​

సమాజ సేవకు రూ.150 కోట్లు... ప్రకటించిన మలబార్ గోల్డ్​

హైదరాబాద్, వెలుగు:   మలబార్ గ్రూప్ తమ కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్స్​బిలిటీ (సీఎస్సార్​) కార్యక్రమాల కోసం 2025–-26 సంవత్సరానికి గాను రూ.150 కోట్లు కేటాయించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆకలి తీర్చడం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ,  పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి వాటి కోసం ఈ డబ్బును ఖర్చు పెడుతుంది. 

తమ ప్రధాన సామాజిక సేవ కార్యక్రమం 'ది హంగర్ ఫ్రీ వరల్డ్' కింద భారతదేశం,  జాంబియా దేశాల్లోని నిరుపేదలకు నిత్యం 70 వేల భోజనాలు అందిస్తుంది. 2025–-26 సంవత్సరంలో మొత్తం 2.50 కోట్ల భోజనాలను అందిస్తామని మలబార్ ​తెలిపింది.