జాగ్రఫి బిట్ బ్యాంక్: బయోస్పియర్ రిజర్వులు

జాగ్రఫి బిట్ బ్యాంక్: బయోస్పియర్ రిజర్వులు

బయోస్పియర్ రిజర్వులు..

  • 1992లో యూఎన్ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరిగిన ధరిత్రి సమావేశంలో 171 దేశాల భాగస్వామ్యంతో జీవ వైవిధ్య ఒప్పందం జరిగింది.
  •  ఈ ఒప్పందం ప్రకారం ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణ చేపడతారు.
  •  ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాల్లో సంరక్షించడాన్ని ఆవాసాంతర రక్షణ అంటారు.
  •  ఆవాసాంతర రక్షణలో భాగంగా బయోస్పియర్ రిజర్వులు, జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
  •  బయోస్పియర్ రిజర్వుల్లో జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను పరిరక్షిస్తారు. ఇక్కడ టూరిజాన్ని అనుమతించరు.
  •  దేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.
  • దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి (తమిళనాడు). దీనిని 1986లో ఏర్పాటు చేశారు.
  •  దేశంలో చివరిగా ప్రకటించిన బయోస్పియర్ రిజర్వ్ పన్నా (మధ్యప్రదేశ్).
  •  యునెస్కో జాబితాలో దేశంలోని 12 బయోస్పియర్ రిజర్వులను చేర్చారు (ప్రస్తుత లెక్కల ప్రకారం). 
  •  బయోస్పియర్ రిజర్వుల కోసం యునెస్కో ఎంఏబీ( మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్) అనే కార్యక్రమం ప్రారంభించింది.
  •  దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రన్ ఆఫ్ కచ్ (12,454 చ.కి.మీ.).
  •  దేశంలో అతి చిన్న బయోస్పియర్ దిబ్రూ-సైఖోవా (అస్సాం). 

జాతీయ పార్కులు

  •  జాతీయ పార్కుల్లో జంతువులను సహజంగా రక్షిస్తారు. ఇక్కడ వేట, ప్రైవేట్ కార్యకలాపాలు, కలప సేకరణ నిషేధం.
  •  దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జాతీయ పార్క్ - హేలీ (1936). ఆ తర్వాత దీనిని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు.
  •  ప్రస్తుతం దేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయి.
  •  దేశంలో అత్యధికంగా అండమాన్ నికోబార్ (9), మధ్యప్రదేశ్ (9)ల్లో ఉన్నాయి.

వన్యమృగ సంరక్షణ కేంద్రాలు

  •  వన్యమృగ సంరక్షణ కేంద్రాల్లో అంతరించిపోయే జీవజాతులను సంరక్షిస్తారు. ఇక్కడ పరిమితంగా అనుమతులు ఉంటాయి.
  •  దేశంలో ప్రస్తుతం 560కి పైగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
  •  దేశంలో మొదటి పక్షి సంరక్షణ కేంద్రం వేదాంతంగల్ (తమిళనాడు). 

దేశంలో పెద్ద వన్యప్రాణి సంరక్షణ 

  • కేంద్రం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ శాంక్చువరీ (మహారాష్ట్ర).
  •  తెలంగాణలో కాసు బ్రహ్మానందరెడ్డి, కవ్వాల్, మృగవని, ఏటూరు నాగారం, మహావీర్ హరిణ వనస్థలి, పోచారం, పాకాల, మంజీరలలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
  •  ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి సహజ సిద్ధ పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించే విధానాన్ని ఆవాసేతర రక్షణ అంటారు.
  •  ప్రపంచంలో ఇప్పటివరకు 36 ఎకలాజికల్ హాట్‌స్పాట్లను గుర్తించారు.
  •  దేశంలో ఈశాన్య హిమాలయాలు, పశ్చిమ కనుమలను ఎకలాజికల్ హాట్‌స్పాట్​లుగా గుర్తించారు.
  •  మాజులీ దీవిని ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించారు.
  • జల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉంది.
  •  ప్రఖ్యాతిగాంచిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్‌లో ఉంది.
  •  కర్ణాటకలోని బందీపూర్ జాతీయ పార్క్ వన్యప్రాణుల సంరక్షణకు ప్రసిద్ధి.
  •  దేశంలో అత్యధిక జీవవైవిధ్యం పశ్చిమ కనుమలలో ఉంది.
  •  మధ్యప్రదేశ్‌లోని పన్నా నేషనల్ పార్క్ గుండా కెన్ నది ప్రవహిస్తోంది.
  •  దేశంలో శ్రీశైలం (నాగార్జునసాగర్ - శ్రీశైలం) వన్యప్రాణి సంరక్షణ స్థలం అన్నిటికంటే పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం.
  •  దేశంలో ప్రాజెక్ట్ టైగర్ పథకం 1973లో ప్రారంభమైంది.