- రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు, నాన్కేడర్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ అపాయింట్ అయ్యారు. ఇక్కడ సీపీగా ఉన్న అంజనీ కుమార్.. ఏసీబీ డీజీపీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సెంట్రల్ సర్వీస్లో ఉన్న సీవీ ఆనంద్ ఈ మధ్యే రాష్ట్ర సర్వీసుకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగానే ఆయనకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన సైబరాబాద్ సీపీగా, సివిల్ సప్లయ్స్ కమిషనర్గా పనిచేశారు.