- ఫేక్ లీగల్ నోటీసులు పంపి బెదిరిస్తున్న సైబర్ గ్యాంగ్
- పార్ట్ టైమ్ జాబ్ల పేరుతో మోసం
- 25 రాష్ట్రాల్లో బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు
- నలుగురు నిందితుల అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు : పార్ట్టైం జాబ్ల పేరుతో రిక్రూట్ చేసుకుని వర్క్ సరిగా చేయట్లేదంటూ ఫేక్ లీగల్ నోటీసులు పంపి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దేశంలోని 25 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబరాబాద్ పరిధిలో ఉండే ఓ యువతి పార్ట్ టైమ్ జాబ్ కోసం ఎదురుచూస్తోంది.
కొంతకాలం కిందట ఆమెకు ఫ్లోరా సొల్యూషన్స్ అనే కంపెనీలో క్యాప్చా టైపింగ్ వర్క్ పేరిట పార్ట్టైం జాబ్ ఆఫర్ అంటూ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఆ యువతి జాబ్లో జాయిన్ అయ్యింది. లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వడంతో వర్క్ చేసి సబ్మిట్ చేసింది. మీరు సరిగా వర్క్ చేయలేదని కంపెనీ ప్రతినిధి చెప్పడంతో సదరు యువతి లాగ్అవుట్అయ్యింది.
కంపెనీ రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆ యువతికి కంపెనీ ప్రతినిధి లీగల్ నోటీసులు పంపించి బెదిరించాడు. చార్జీల పేరుతో యువతి నుంచి రూ.6 లక్షల 17 వేలు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఇలా చీటింగ్ చేస్తరు..
రాహుల్అశోక్ భాయ్(25), సాగర్ పాటిల్(24), కల్పేష్ థోరట్(26), నీలేష్ పాటిల్(24) ఈ నలుగురు గుజరాత్ రాష్ట్రం సూరత్లోని దిండోలి గ్రామానికి చెందిన వారు. రాహుల్ సూరత్లో డేటా ఎంట్రీ కంపెనీలో టెలీకాలర్గా పనిచేశాడు. ఈ కాల్సెంటర్ ఓనర్ నితీశ్ను అక్కడి పోలీసులు అరెస్టు చేయడంతో అది మూతపడింది. దీంతో రాహుల్ మోసాలకు స్కెచ్ వేశాడు. తన గ్రామానికి చెందిన క్లాస్
మేట్స్ను సంప్రదించాడు. ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా జాబ్స్ కోసం వెతుకుతున్న వారి వివరాలను సేకరించాడు. సాగర్ పాటిల్ టెలీకాలర్గా, కల్పేష్ అండ్నీలేష్ బ్యాంక్అకౌంట్లను సప్లయ్ చేశారు. ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారికి రాహుల్ వాట్సాప్ ద్వారా ఫ్లోరా సొల్యూషన్ నుంచి పార్ట్ టైమ్ డేటా ఎంట్రీ పేరుతో జాబ్స్ ఆఫర్స్ అంటూ మెసేజ్లు పంపేవాడు. స్పందించిన వారికి డేటా ఎంట్రీ జాబ్పేరుతో లాగిన్ ఐడీ
పాస్వర్డ్ ఇచ్చి డేటా ఎంట్రీ వర్క్ఇచ్చేవారు. ఎవరైతే జాబ్ లోజాయిన్అయ్యి వర్క్ కంప్లీట్చేసి సబ్మిట్చేసిన తర్వాత.. ఆ వర్క్ సరిగా చేయలేదని రాహుల్వారితో చెప్పేవాడు. ఒకవేళ లాగ్అవుట్ చేస్తే కంపెనీ రూల్స్ పాటించలేదుంటూ ఫేక్ లీగల్ నోటీసులు పంపించేవాడు. బెదిరించి వివిధ చార్జీల పేరుతో బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు.
358 సైబర్ క్రైమ్ కేసుల్లో నిందితులు..
డేటా ఎంట్రీ జాబ్స్ పేరుతో చీటింగ్ చేస్తున్న ఈ నలుగురు నిందితులను సూరత్ సిటీలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్ టాప్, 5 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 358 సైబర్ క్రైమ్ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని.. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గ్యాంగ్ పై 28 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 11 కేసుల్లో ఈ నలుగురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.