బ్లాక్​లో ఐపీఎల్ ​టికెట్ల విక్రయం..ముగ్గురు టెకీలు అరెస్ట్

బ్లాక్​లో ఐపీఎల్ ​టికెట్ల విక్రయం..ముగ్గురు టెకీలు అరెస్ట్
  •    15 ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్​ టికెట్లు స్వాధీనం

మాదాపూర్, వెలుగు : బ్లాక్​లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్​వేర్ ఉద్యోగులను సైబరాబాద్​పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్​చెరు ఇస్నాపూర్​కు చెందిన మధుబాబు(30), సైనిక్​పురి డిఫెన్స్​కాలనీకి చెందిన మాథ్యూ రోడ్రిక్స్(25), కొండాపూర్​అంజయ్యనగర్​లోని ప్రైవేట్ హాస్టల్​లో ఉండే నిజంతన్ ఎలంగోవన్(26) ప్రస్తుతం హైదరాబాద్​లో జరుగుతున్న ఐపీఎల్​మ్యాచ్​లకు టికెట్లు దొరకడం కష్టంగా ఉందని గుర్తించారు. పేటీఎం ఇన్​సైడర్​లో టికెట్లు పెట్టగానే పదుల సంఖ్యలో కొనేస్తున్నారు.

వాటిని బ్లాక్​లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్​జోన్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం కొండాపూర్​ఏరియాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 25న ఉప్పల్​వేదికగా జరగనున్న సన్​రైజర్స్​హైదరాబాద్​వర్సెస్​రాయల్​చాలెంజర్స్​బెంగళూరు మ్యాచ్​కు సంబంధించిన 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్​ను రూ.10 వేల నుంచి రూ.15 వేలు చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదైంది.