
హైదరాబాద్: రాయదుర్గం డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్ ను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్. పట్టుబడిన డ్రగ్స్ ను మాయం చేసి అమ్ముతున్న ఎస్సై రాజేందర్ ను ఇటీవల రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఎస్సై రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కూకట్పల్లి కోర్టు రాజేందర్ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ లో ఎస్ ఐ గా పనిచేస్తున్న రాజేందర్.. 2023 ఫిబ్రవరిలో సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ముంబై వెళ్లారు. అక్కడా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ నుఅ రెస్ట్ చేసి అతడిని నుంచి 1,750 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే సీజ్ చేసిన డ్రగ్స్ ను ఇంట్లోనే దాచి విక్రయించేందుకు ప్రయత్నించాడు.
సమాచారం తెలుసుకున్న నార్కోటిక్ విభాగం పోలీసులు రాజేందర్ ను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం రాజేందర్ ను దోషిగా తేల్చారు. అయితే తాజాగా (2023 సెప్టెంబర్ 6న ) రాజేందర్ ను సస్పెండ్ చేస్తూ సీసీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.