అడిగినంత డబ్బు ఇవ్వలేదని ఫొటోలు మార్ఫింగ్

అడిగినంత డబ్బు ఇవ్వలేదని ఫొటోలు మార్ఫింగ్
  •     బాధితుడి ఫ్రెండ్స్ కు షేర్​ చేసిన సైబర్​ నేరగాళ్లు

ఘట్​కేసర్, వెలుగు : అడిగినంత డబ్బు ఇవ్వలేదని సైబర్​నేరగాళ్లు సిటీకి చెందిన యువకుడి ఫొటోలను మార్ఫింగ్​చేశారు. న్యూడ్ గా మార్చి, వాటిని అతని ఫ్రెండ్స్ కు షేర్​చేశారు. ఘట్​కేసర్​సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్​కేసర్​కు చెందిన ఇద్దరు యువకులు అన్నదమ్ములు. అన్న(25) ఎంటెక్, తమ్ముడు(25) బీటెక్​చదువుతున్నారు. ఇటీవల తమ్ముడికి సైబర్​నేరగాళ్లు ఫోన్​చేశారు. ‘మీ అన్న మా లోన్​యాప్ లో లోన్​తీసుకున్నాడు. తిరిగి కట్టలేదు. చెల్లించకపోతే ఫొటోలు మార్ఫింగ్​చేసి బంధువులు, స్నేహితులకు పంపిస్తాం.’ అని బెదిరించారు.

యువకుడు స్పందిస్తూ.. ‘మా అన్న తీసుకున్న లోన్​క్లియర్​చేశాడు. ఇంకెవరికీ కట్టాల్సిన అవసరం లేదు. ఏమి చేసుకుంటారో చేసుకోండి’ అని గట్టిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన సైబర్​నేరగాళ్లు సోషల్ యాప్స్​లోని అకౌంట్ల నుంచి యువకుడి ఫొటోలను డౌన్​లోడ్​చేశారు. వాటిని న్యూడ్​ఫొటోలుగా మార్ఫింగ్​చేసి, అతని సోషల్​మీడియా ఫ్రెండ్స్, వాట్సాప్​కాంటాక్టులకు పంపించారు. ఫ్రెండ్స్​ద్వారా విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.