నోట్ల కట్టలపై D51.. డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల వెరైటీ పోస్టర్

నోట్ల కట్టలపై D51.. డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల వెరైటీ పోస్టర్

డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల(Sekhar Kammula)..ధనుష్ (Dhanush) కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ధనుష్ D51గా  పట్టాలెక్కనున్న ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో శేఖర్ కమ్ముల చూపించిన కాన్సెప్ట్.. 'అసమానతను సూచిస్తూ, నగరాన్ని విభజించే కరెన్సీ నోట్లు..ఎంతో  ఖ‌రీదైన భారీ బిల్డింగులు..మ‌రోవైపు పేద‌రికాన్ని ప్ర‌తిబింబించేలా మురికివాడ‌లు..ఈ రెండింటికి మ‌ధ్య‌లో పాత వంద రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌ని' చూపించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. 

దీంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల  మరో లీడర్ మూవీని చూపిస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. హీరో ధనుష్ తో సమాజాన్ని ఉద్దేశించే కథతో.. ఒక మంచి మార్పును తీసుకురావడం కోసం.. శేఖర్ కమ్ముల కేవలం స్క్రిప్ట్ కోసమే రెండేళ్లు వర్క్ చేసినట్లు తెలుస్తోంది. సహజంగా శేఖర్ కమ్ముల చిత్రాల్లో కథా బలం ఎక్కువగా కనిపిస్తోంది.దానికి తోడు ధనుష్ లాంటి హీరోతో రావడం..ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

రానా తో తీసిన లీడర్ మూవీ అప్పట్లో సోసైటీ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇక ధనుష్ 51వ పోస్టర్  రావడంతో మరోసారి శేఖర్ కమ్ముల నుంచి స‌మాజాన్ని ప్ర‌శ్నించేలా...సోసైటీలో అస‌మాన‌తల్ని ఎత్తి చూపుతూ త‌న‌దైన మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చి దిద్దుతారనే విషయం అర్ధమవుతోంది. ఈ మూవీలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. రష్మిక మందన్న ధనుష్ కు జోడీగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 
 
ధనుష్ 51వ  చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీను నిర్మిస్తున్నారు.ఈ మూవీలో ధనుష్‌ను మునుపెన్నడూ చూడని గెటప్ లో చూడబోతున్నట్టు సమాచారం.