ఆశా పరేఖ్‌ కు అరుదైన గౌరవం

ఆశా పరేఖ్‌ కు  అరుదైన గౌరవం

బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ కు  అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గాను ఆమెకు  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వనున్నారు.  ఈ విషయాన్ని  కేంద్ర  మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశేష సేవలకు గాను ఆమెకు ఈ అవార్డును ప్రధానం  చేయనున్నారు. 1992లో  భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. గతంలో రాజ్ కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్,  ఏఎన్నార్,  వినోద్ ఖన్నా తదితరులు అందుకున్నారు. దేవికా రాణి మొదటి విజేత కాగా, రజనీకాంత్‌కు గతేడాది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును  ప్రధానం చేశారు.