కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న సానూభూతిని వాడుకోవాలి

కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న సానూభూతిని వాడుకోవాలి

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండబోదని, ఒకవేళ అలాంటిదే జరిగితే తనలాంటి చాలా మంది నాయకులు పార్టీలో కొనసాగరని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. అందుకే పీకే కేసీఆర్ తో తెగదెంపులు చేసుకున్నారని పేర్కొన్నారు. త్వరలోనే పీకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపిన ఆయన... గుజరాత్ పీసీసీకి పీకే ప్రెసిడెంట్ కావొచ్చని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుభూతి ఉందని, దాన్ని తమ నాయకులు వాడుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం...

ఆర్సీబీపై ల‌క్నో గెల‌వాలంటే ఈ మార్పు చాలా అవ‌స‌రం..!

ఎంఐఎం అంటే టీఆర్ఎస్కు భయమెందుకు..?