జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : దామోదర రాజనర్సింహా

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : దామోదర రాజనర్సింహా

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని ఆయన స్వగృహంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2024 రూపొందించిన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సాయినాథ్, నాగభూషణం, సునీల్, కృష్ణ, వీరేందర్ గౌడ్, పుండరీకం పాల్గొన్నారు.

జోగిపేట: జోగిపేట పట్టణ గుమస్తా సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో  మంత్రి దామోదర రాజనర్సింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్కర్ సమాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జోగిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.