అన్నవరం దేవస్థానంలో కరోనా: 14వ తేదీ వరకూ దర్శనాలు రద్దు

అన్నవరం దేవస్థానంలో కరోనా: 14వ తేదీ వరకూ దర్శనాలు రద్దు

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి(శుక్రవారం) వరకు 10 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. ఇవాళ(శనివారం) 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయాధికారులు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు.