శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి దర్శనాల నిలిపివేత

శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి దర్శనాల నిలిపివేత

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి(బుధవారం) నుంచి భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. వారం రోజుల పాటు దర్శనాలు ఉండవని ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయానికి చెందిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు వర్కర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ అనుమతితో ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపి వేస్తున్నట్టు ఈవో ప్రకటించారు. అయితే స్వామివారు, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఈవో తెలిపారు.