విశ్వక్ సేన్ ‘దమ్కీ’ ట్రైలర్‌ రిలీజ్ చేసిన బాలయ్య

విశ్వక్ సేన్ ‘దమ్కీ’ ట్రైలర్‌ రిలీజ్ చేసిన బాలయ్య

టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా, స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. ఇందులో విశ్వక్ కు జంటగా నివేథా పేతురాజు నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవ‌రిలో విడుదల కానుంది. తాజా ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. 

ట్రైలర్‌ విషయానికొస్తే.. "అదో కార్పొరేట్ సామ్రాజ్యం. వేల కోట్ల ఆస్తి.. వంద‌ల మంది ఉద్యోగులు.. వీళ్ల భ‌విష్యత్తంతా త‌లకిందులు అయిపోతుంటుంది. మ‌రోవైపు.. హీరో ఓ హోటెల్‌లో వెయిట‌ర్‌గా పనిచేస్తూ ద‌ర్శన‌మిస్తాడు. హీరో జీవితంలో స‌డ‌న్ గా ఓ ట్విస్ట్ వ‌స్తుంది.వేల కోట్ల కంపెనీని కాపాడే బాధ్య‌త త‌న‌మీద ప‌డుతుంది. అదేంటనేదే ద‌మ్కీ క‌థ‌.  ఈ ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు.