టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కథానాయకుడిగా, స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దాస్ కా దమ్కీ’. ఇందులో విశ్వక్ కు జంటగా నివేథా పేతురాజు నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరిలో విడుదల కానుంది. తాజా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికొస్తే.. "అదో కార్పొరేట్ సామ్రాజ్యం. వేల కోట్ల ఆస్తి.. వందల మంది ఉద్యోగులు.. వీళ్ల భవిష్యత్తంతా తలకిందులు అయిపోతుంటుంది. మరోవైపు.. హీరో ఓ హోటెల్లో వెయిటర్గా పనిచేస్తూ దర్శనమిస్తాడు. హీరో జీవితంలో సడన్ గా ఓ ట్విస్ట్ వస్తుంది.వేల కోట్ల కంపెనీని కాపాడే బాధ్యత తనమీద పడుతుంది. అదేంటనేదే దమ్కీ కథ. ఈ ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు.