ఆర్టీసీ కార్మికులకు 4.8 శాతం డీఏ శాంక్షన్ : సజ్జనార్‌‌‌‌‌‌‌‌

ఆర్టీసీ కార్మికులకు  4.8 శాతం డీఏ శాంక్షన్ : సజ్జనార్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు 4.8 శాతం డీఏను శాంక్షన్ చేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ ఏడాది జులై డీఏ ఈ నెల జీతంలో యాడ్ అవుతుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. కష్ట కాలంలో కూడా 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసిందన్నారు. కాగా, 2019 నుంచి డీఏ బకాయిలు రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

డీఏ బకాయిలు చెల్లించాలి: జేఏసీ 

కార్మికులకు పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను  విడుదల చేయాలని జేఏసీ కన్వీనర్ వీఎస్ రావు డిమాండ్ చేశారు. మొత్తం 173 నెలల బకాయిలు సుమారు రూ. 750 కోట్లు చెల్లించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.