కర్నాటక లీడర్లకు ఇక్కడేం పని.. బీఆర్ఎస్ 70 సీట్ల కు పైగా గెలుస్తుంది: దాసోజూ శ్రవణ్

కర్నాటక లీడర్లకు ఇక్కడేం పని.. బీఆర్ఎస్ 70 సీట్ల కు పైగా గెలుస్తుంది: దాసోజూ శ్రవణ్

హైదరాబాద్ : బీఆర్ఎస్  ముమ్మాటికీ  70 సీట్ల కు పైగా గెలుస్తుందని ఆ పార్టీ నేత దాసోజూ శ్రవణ్ అన్నారు. కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ది పేగు బంధమని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్ కు ఎక్జాక్ట్ పోల్స్ కు మధ్య చాల తేడా ఉంటదని తెలిపారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు లేఖి తనం చూపిస్తున్నారు. చిల్లర ప్రచారం చేస్తున్నారు.

సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు. అని దాసోజూ శ్రవణ్  చెప్పారు. కర్ణాటక నేతలకు తెలంగాణ లో ఏం పనని.. గద్దల్లాగా వచ్చి పడుతున్నారని మండిపడ్డారు.