తల్లిని హత్య చేసిన కూతురు

తల్లిని హత్య చేసిన కూతురు

హైదరాబాద్:  పెడదోవ పడుతున్న కూతుర్ని మందలించినందుకు చివరికి ఆ కూతురి చేతిలోనే హత్యకు గురైంది ఓ తల్లి. ఇద్దరు యువకులతో వ్యవహారం నడుపుతున్న కూతుర్ని తగదని హెచ్చరించిన పాపానికి ప్రియుడితో కలిసి చంపేసింది. వివరాల్లోకి వెళ్తే… యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి కుటుంబం బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చింది.  లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి.. భార్య రజిత, కూతురి కీర్తి లతో కలిసి మునగనీర్ లో నివాసముంటున్నారు.

కూతురి ప్రవర్తన లో మార్పు ను గమనించిన తల్లి రజిత… ఆమెను మందలించింది. ఇద్దరు వ్యక్తులతో నడుపుతున్న ప్రేమ వ్యవహారం పై మండి పడింది. తల్లి మాటలపై కోపం పెంచుకున్న కీర్తి ఆమెను అంతమొందించాలనుకుంది. ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. సరైన సమయం చూసి తండ్రి డ్యూటీకి వెళ్లినపుడు… ప్రియుణ్ని ఇంటికి రప్పించుకొని, అతని సహాయంతో తల్లిని హత్య చేసింది. తల్లి మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి ఇంట్లోనే మూడు రోజుల పాటు గడిపింది. డెడ్ బాడీ దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో వారి స్వగ్రామమైన రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. ఆ తర్వాత వైజాక్ టూర్ వెళుతున్నానని తండ్రికి చెప్పి ఇంటి వెనుకాల ఉండే మరో ప్రియుడితో అతని ఇంట్లో గడిపింది.

అనుమానం వచ్చిన తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. జరిగిన ఘోరం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా..ల విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు కీర్తి ఒప్పుకుంది. పోలీసులు  ఈ హత్య కేసుపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

Daughter kill her mother in Hyderabad city