గువ్వల అరాచక పాలనను అంతం చేద్దాం : వంశీకృష్ణ

గువ్వల అరాచక పాలనను అంతం చేద్దాం : వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు : గువ్వల బాలరాజ్ అరాచక పాలనను అంతం చేద్దామని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం అచ్చంపేట మండలంలోని గంపన్ పల్లి గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ గ్రామంలో 100 మంది, అంకిరోనిపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల్ల ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి న గువ్వలవును ఇక్కడి నుంచి తరిమి కొట్టాలన్నారు. కార్యక్రమంలో నేతలు కపిలవాయి చంద్రమోహన్, రమేశ్​ రెడ్డి, రాజేశ్​ , రామనాథం, గోపాల్ రెడ్డి, సంతోష్​ రెడ్డి, ఆంజనేయులు, ఖాదర్ పాల్గొన్నారు.