మంత్రిపై అసత్య ప్రచారం చేస్తే సహించం..డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఫైర్

మంత్రిపై అసత్య ప్రచారం చేస్తే సహించం..డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఫైర్

చెన్నూరు, వెలుగు: కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను డీడీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​ రెడ్డి, కాంగ్రెస్​ నేతలు తీవ్రంగా ఖండించారు. చెన్నూరులోని ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనుల పేర్లు మార్చి తానే చేస్తున్నానని మంత్రి చెప్పుకుంటున్నారని సుమన్​అనడం విడ్డూరంగా ఉందన్నారు.

 గొప్పలు చెప్పుకుంటున్న బాల్క సుమన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. మంత్రి వివేక్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, పట్టణంలో సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. సుమన్​ చెన్నూరు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

 నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారీ, కాంగ్రెస్​పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, నేతలు గొడిసెల బాపిరెడ్డి, రాజమల్ల గౌడ్, సత్యనారాయణ రెడ్డి, ఫయాజ్, చెన్నూరు, కోటపెల్లి, భీమారం, జైపూర్ మండలాల సర్పం చులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.