బోధన్​లో బీఆర్ఎస్ కు ​మరో షాక్ : సుదర్శన్​రెడ్డి

బోధన్​లో బీఆర్ఎస్ కు ​మరో షాక్  : సుదర్శన్​రెడ్డి

కాంగ్రెస్​లో చేరనున్నట్లు ప్రకటించిన మాజీ డీసీసీబీ చైర్మన్​గంగాధర్​ పట్వారీ

బోధన్, వెలుగు: బోధన్ లో బీఆర్ఎస్​కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. మున్సిపల్ ​చైర్​పర్సన్​తూము పద్మావతి, ఆమె భర్త  కౌన్సిలర్ ​తూము శరత్​రెడ్డితో పాటు మరో అయిదుగురు కౌన్సిలర్లు వారం కింద బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​చేరగా, ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా డీసీసీబీ చైర్మన్​​గా వ్యవహరించిన గంగాధర్ పట్వారీ సైతం కాంగ్రెస్​లో  చేరనున్నారు. కాంగ్రెస్ ​అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి బుధవారం పట్వారీ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నెల 27న బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరనున్నట్లు గంగాధర్​ పట్వారీ తెలిపారు.

ALS0 READ: మా భూమి మాకివ్వండి .. కుదబక్షపల్లి రైతులు డిమాండ్