- రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి
గండిపేట్,వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిటీ శివారు ఔటర్రింగ్ రోడ్డు సరిహద్దుల్లో రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా నిఘా ఉంటుందని
ప్రజలు రూ. 50 వేల నగదు కంటే ఎక్కువ, బంగారు ఇతర వస్తువులు తీసుకెళ్లే వారు ఆధారాలు చూపించాలన్నారు. లేకపోతే సీజ్ చేస్తామన్నారు. ఇప్పటివరకు 4.50 కోట్ల నగదు, 4,730 తులాల బంగారం, 420 లీటర్ల మద్యం బాటిల్స్తో పాటు 35 కేజీల గాంజా పట్టుకున్నామన్నారు.