- గత నెల రూ. 1.6 లక్షల కోట్లు పెట్టుబడులు
న్యూఢిల్లీ: డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్లోకి గత నెల రూ. 1.6 లక్షల కోట్ల నికర నిధులు వచ్చాయి. అంతకు ముందు సెప్టెంబర్లో రూ. 1.02 లక్షల కోట్లు నికర ఔట్ఫ్లోస్ ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) వెల్లడించింది. గతంలో లిక్విడిటీ సమస్యలు ఉన్న కారణంగా నిధులు వెనక్కి తీసుకున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు మళ్లీ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వల్పకాలిక కేటగిరీల్లో ఎక్కువ నిధులు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్ రూ. 89,375 కోట్ల నికర ఇన్ఫ్లోస్తో పుంజుకున్నాయి. ఓవర్నైట్ ఫండ్స్లోకి రూ. 24,051 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ. 17,916 కోట్లు అదనంగా వచ్చాయి. డైనమిక్ బాండ్ ఫండ్స్లోకి రెండు నెలల ఇన్ఫ్లోస్ తర్వాత రూ. 232 కోట్ల ఔట్ఫ్లో నమోదైంది. క్రెడిట్ రిస్క్ ఫండ్స్లో అంతకుముందు నెలతో పోలిస్తే రూ. 84 కోట్ల ఔట్ఫ్లో ఉంది. కార్పొరేట్ బాండ్ ఫండ్స్లోకి రూ. 5,122 కోట్లు వచ్చాయి.
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్ఐఎఫ్
ఐటీఐ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ తన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎస్ఐఎఫ్) ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది. దీని కింద మొదటి ఆఫరింగ్గా 'దివినిటి ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్'ను తీసుకొచ్చింది. ఈ ఫండ్ మార్కెట్ సైకిల్స్లో వృద్ధిని సాధించడం, నష్టాలను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఓపెన్-ఎండెడ్ స్ట్రాటజీ. లిస్టెడ్ ఈక్విటీలు, డెరివేటివ్ల ద్వారా లిమిటెడ్ షార్ట్ పొజిషన్స్లో పెట్టుబడి పెడుతుంది. ఎన్ఎఫ్ఐ సోమవారం మొదలవగా, ఈ నెల 24న ముగుస్తుంది. ఈ ఫండ్లో క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు కనీస పెట్టుబడిని రూ. 10 లక్షలుగా నిర్ణయించారు.
ఐపీఓలలో భారీగా ఎంఎఫ్ల పెట్టుబడి
ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్లు ఐపీఓలలో రూ. 8,752 కోట్ల పెట్టుబడులు పెట్టాయని స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫారమ్ వెంచురా వెల్లడించింది. ఈ కొత్త లిస్టింగ్స్లో అధిక భాగం స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్నాయి, మిడ్ క్యాప్ విభాగంలో కేవలం ఒకటే ఉంది. దీన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో అధిక రాబడిని అందించే సామర్థ్యం ఉన్న చిన్న వ్యాపారాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడి పెడుతున్నాయని తెలుస్తోంది. ఈ క్వార్టర్లో 9 మిడ్ క్యాప్లు లార్జ్ క్యాప్లుగా మారే అవకాశం ఉందని, 6 స్మాల్ క్యాప్లు మిడ్ క్యాప్లుగా మారే అవకాశం ఉందని మ్యూచువల్ ఫండ్స్భావిస్తున్నాయని వెంచురా తెలిపింది.
