
క్రికెట్లో ఫిట్నెస్ అంటే మొదట గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ పేర్లే. ఫిట్నెస్తో ఇప్పటివరకు ఉన్న రికార్డులు కూడా వాళ్ల పేర్లమీదే ఉన్నాయి. అయితే, ఆ రికార్డులను తుడిచేస్తూ టీమిండియా విమెన్స్ టీం ఆల్రౌండర్ దీప్తి శర్మ రికార్డు సృష్టించింది.
25 ఏళ్ల దీప్తి 2020–23 మధ్య ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా వరుసగా 50 టీ20 మ్యాచులు ఆడింది. 2016–-21 మధ్యలో కూడా వరుసగా 54 వన్డేలు ఆడి రికార్డు నెలకొల్పింది. ఎంతో ఫిట్గా ఉండే ధోనీ, కోహ్లీలతో సహా ఇతర ఆటగాళ్లు, మహిళా క్రికెటర్లకు కూడా ఈ ఫీట్ అందుకోవడం ఇప్పటివరకు సాధ్యపడకపోవడం విశేషం. ఓవరాల్గా 80 వన్డేలు ఆడిన దీప్తి శర్మ 36.36 సగటుతో1,891 రన్స్ చేసింది. 4.18 ఎకానమీతో 91 వికెట్లు తీసింది. 87 టీ20 మ్యాచుల్లో 106.52 స్ట్రైక్ రేట్తో 914 రన్స్ చేసి, 96 వికెట్లు తీసింది.