
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఖండాంతర అణు క్షిపణి అయిన బ్రహ్మోస్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దీని ద్వారా సుమారు 5 వేల మందికి పైగా ఉగ్యోగాలు వస్తాయని అన్నారు. తన సొంత నియోజకవర్గమైన లక్నోలో మంగళవారం ఉదయం రాజ్నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,710 కోట్లతో 180 అభివృద్ధి కార్యక్రమాలను లాంచ్ చేశారు.
We have decided that the 'BRAHMOS' missile will be built in Lucknow. CM has estimated that it will provide jobs to 5,000 people... A target has been set to provide PNG gas to every household in Lucknow: Defence Minister Rajnath Singh pic.twitter.com/Gt52kqD2zx
— ANI UP (@ANINewsUP) August 31, 2021
అలాగే 90 వేర్వేరు ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజు ఉదయం రాజ్నాథ్ శంకుస్థాపన చేశారు. ఆయా డెవలప్మెంట్ పనులన్నీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఇరిగేషన్, లక్నో మున్సిపల్ కార్పొరేషన్, లక్నో డెవలప్మెంట్ అథారిటీ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు సంబంధించినవి. ఈ సందర్భంగా యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మాట్లాడుతూ దేశంలోనే టాప్ సిటీలో ఒకటిగా ఉండాలని లక్నో డెవలప్మెంట్ గురించి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కలలు కన్నారని, వాటిని రాజ్నాథ్ సింగ్ నిజం చేస్తున్నారని అన్నారు.